మత్స్యకారులకు జీవనోపాధి కరువు!

  • ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు

నెల్లూరు: తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు జీవనోపాధి కరువై పోతున్నా వైసిపి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. చిల్లకూరు మండలంలోని గుమ్మల్లదిబ్బ గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం పేరుతో అభివృద్ధిని మరచి గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేని వైసీపీని ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. పవర్ ప్లాంట్స్ వల్ల నీరు కలుషితమై మత్స సంపద కనుమరుగవుతున్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో తిరుపతి ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ రావు గారికి కమలం గుర్తుపై, ఎంఎల్ఏ అభ్యర్థి సునీల్ కుమార్కు సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మనోజ్, కార్తీక్, మహేష్, రాములు, సుధీర్, సాయి, వసంత్, అక్బర్, హర్షిత్, బీజేపీ నాయకులు పోలయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు.