ఎన్డీఏ కూటమి గెలుపు కోసం జనసేన పల్లెబాట
పార్వతీపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలనుసారంగా ఎన్డీఏ కూటమి గెలుపు కోసం పార్వతీపురం జనసేన మండల టీమ్ మండల అధ్యక్షులు అగూరు మణి ఆధ్వర్యంలో జనసేన పల్లెబాట కార్యక్రమం పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మండలం, పెద్దమరికి పంచాయతీ చినమరికి గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మణి ఆ గ్రామ ప్రజలతో మమేకమై ఉమ్మడి అభ్యర్థులైన ఎమ్మెల్యే అభ్యర్థి బొనేల విజయచంద్రని సైకిల్ గుర్తు పైన మరియు ఎంపీ అభ్యర్థి క్రొత్తపల్లి గీత గారిని కమలం గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించి అవినీతి పరులైనా వైయస్సార్సిపి నాయుకులు గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపే ఎన్డీఏ కూటమి గెలిపించవల్సినదిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు ఖాతా విషేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీశంకర్, అక్కెన భాస్కర్, ప్రాత పవన్, తిరుమరెడ్డి కనకరాజు, జనార్దన్ రావు, నవీన్, శరత్, తాతబాబు మహేష్, జగదీష్, రవి, గౌరీశంకర్, టిడిపి నాయుకులు మరిచర్ల సత్యం నాయుడు, గౌరా గుంప స్వామి, గొబ్బూరు శంకర్రావు, నెక్కెట్ల సత్యం, జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు, ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-06-at-9.12.55-PM-1024x770.jpeg)