ఎన్డీఏ కూటమిని గెలిపించండి: కొట్టె మల్లికార్జున

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి బిజెపి జనసేన పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పొత్తు పెట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. డోన్ అసెంబ్లీ బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి పర్యటన నిమిత్తం ఏపీ బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి అమ్మను వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం బిజెపి టిడిపి జనసేన నాయకులతో కలిసి కొరిమామిడి, తాడేమల్లి మరియు నిడదవోలు మండలంలో ప్రచారంను రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి , నిడదవోలు అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ తరుపున ప్రచారం చేయడం జరిగింది. మే 13 న జరుగనున్న ఎన్నికల పొలింగ్ తేదిన ప్రజలు అందరూ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరిని, నిడదవోలు అసెంబ్లీ ఎంఎల్ఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ ను గెలిపించాల్సిందిగా ప్రజల్ని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తున్న టిడిపి బిజెపి జనసేన కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టిడిపి బిజెపి జనసేన త్రిముఖ కూటమే అని డోన్ అసెంబ్లీ బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో పేర్కొన్నారు. రాజమండ్రి పార్లమెంట్, నిడదవోలు అసెంబ్లీ ప్రచార కార్యక్రమంకు సహకరించిన స్థానిక కూటమి నాయకులకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.