దొంగ ఓట్లు వేయాలనుకుంటే జైలుకు వెళ్లడం ఖాయం

తిరుపతి, 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13వ తేదీ రానున్నదని, దొంగ ఓట్లు వేయడానికి పాల్పడితే ఎవరికైనా సరే జైలు శిక్ష తప్పదని, ప్రముఖ సినీ నిర్మాత ఏ ఏం రత్నం హెచ్చరించారు. ప్రముఖ నిర్మాత జనసేన పార్టీ ప్రచార ప్రధాన కార్యదర్శి రత్నం, జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి రాక్షస పాలనను తరిమి కొట్టడానికి ఉమ్మడి కూటమిగా ఏర్పడి ఆయన చేస్తున్న పోరాటం తనకు నచ్చి పవన్ వెంట నడవడానికి సిద్ధమయ్యానన్నారు. రానున్నది నూటికి నూరు శాతం జనసేన, టిడిపి, బిజెపిల పాలనేనని, తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని కొనియాడారు. జనసేన-టిడిపి అధినేతలు చంద్రబాబు పవన్ రాకతో తిరుపతిలో ఒకసారిగా వాతావరణం మారిందని పెద్ద ఎత్తున తిరుపతి పుర ప్రజలు ఓటమికే పట్టం కట్టబోతున్నారని డా.హరిప్రసాద్, కిరణ్ రాయల్ లు స్పష్టం చేశారు. రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని, ప్రజా పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని ఈ సందర్భంగా వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఆనంద్, జనసేన అబ్సర్వర్ లక్ష్మీపతి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.