కూటమి విజయంతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి

  • నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు

నెల్లూరు: ఎన్డీఏ కూటమి విజయంతోనే దేశం రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోసం జనసేన పార్టీ, సీటీడీపీ ఆధ్వర్యంలో శనివారం గూడూరు మండలంలోని తిప్పవరపాడు గ్రామంలో షణ్ముఖ వ్యూహ్యం, సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు యువత భవిష్యత్తును వైసిపి ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టి అప్పుల ఊబిలోకి నెట్టడన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలన్న, రైతులు బాగుండాలన్న, మహిళలకు భద్రత కల్పించాలన్న జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని అందుకు మే 13 న జరిగే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ బలపరచిన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాద్ రావుకు కమలం గుర్తు పై, గూడూరు ఎంఎల్ఏ గా పాశం సునీల్ కుమార్కు సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు దుద్ధా రాఘవరెడ్డి, దుద్ధా రాధ కృష్ణా రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మస్థానయ్య, జనసేన నాయకులు నాలి గోవర్ధన్, కోసూరు మణికంఠ, షేక్ షబ్బీర్, వెంకటేష్, ఇమ్రాన్, సాయి, యశ్వంత్, పెంచలయ్య, మనోజ్, దగర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.