ఓటు హక్కు వినియోగించుకున్న ప్రమీల ఓరుగంటి
ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండల కేంద్రంలో
24వ బూతు నందు మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ప్రమీల ఓరుగంటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ బాధ్యతతో తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అమె పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ మరువకూడదని హితవు పలికారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-13-at-5.53.22-PM-462x1024.jpeg)