మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్
![](https://janasenanewssletter1.blob.core.windows.net/images/df78a994-81af-4085-ba8e-3d951d77b16b.jpeg)
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఓటు ఉంది. సోమవారం ఉదయం 9 గంటలకు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహా కాలనీ, గిరిజన సహకార సంస్థలో ఏర్పాటు చేసిన బూత్ నంబర్ 197లో ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సిరా గుర్తు ఉన్న వేలును చూపుతూ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ప్రశాంత వాతారణంలో ఎన్నికలు జరగాలని, ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. శ్రీమతి అనా కొణిదెల గారికి భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ సరళిని చూపించారు.