తడబడ్డ ఇండియా.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 125

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. భారత్ నిర్ణిత 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ కు 125పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్‌మెన్ లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(1), శిఖర్ ధవన్(4) వరుస ఓవర్లలో అవుట్ కావడం, కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) మళ్లీ దారుణంతా విఫలం కావడం జట్టుపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఇక రిషబ్ పంత్(21) కొంత సేపు మెరుపులు మెరిపించినా స్టోక్స్ వేసిన స్లో బాల్‌కు దొరికిపోయాడు. మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడబోయి బెయిర్ స్టోకు చిక్కాడు. ఆ తరువాత హార్దిక్ పాండ్యా(19) కూడా కొద్ది సేపటికే అవుట్ కావడం, ఆ తరువాతి బంతికే శార్దూల్ ఠాకూర్(0) కూడా అవుట్ కావడంతో కేవలం 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్(67) అర్థసెంచరీతో మెరవడంతో ఈ పరుగులైనా చేయగలిగింది. ఇక చివర్లో అయ్యర్ కూడా సిక్స్ కొట్టబోయి థర్డ్ మ్యాన్ వద్ద డేవిడ్ మలాన్‌కు దొరికిపోయాడు.