అత్యవసరం అయితేనే పోలీస్ స్టేషన్లకు రావాలి: సీపీ అంజనీకుమార్

ప్రతి పోలీస్ స్టేషన్లలో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు పదే పదే చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను ఫోన్ల ద్వారానే తీసుకోవాలని నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, పోలీసులు సైతం కరోనా బారిన పడుతుండగా ఫిర్యాదుల కోసం ప్రజలు పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేదని, సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అత్యవసరం అయితేనే పోలీస్ స్టేషన్లకు రావాలని సీపీ అంజనీకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.