ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు.. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టార్గెట్ 172

ఐపీఎల్ 14వ సీజన్ కరోనా పరిస్థితుల నడుమ కఠినమైన బబుల్ నిబంధనలతో కొనసాగుతోంది. టోర్నీలో ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 42, జోస్ బట్లర్ 41, శివమ్ దూబే 35, యశస్వి జైస్వాల్ 32 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ కు రెండు వికెట్లు దక్కాయి. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో బుమ్రా 4 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులే ఇవ్వడం విశేషం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం తెలిసిందే.