కొవిడ్ వేళ.. సన్రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం
కరోనా మహమ్మారిపై పోరాటానికి మద్దతుగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ముందుకొస్తున్నాయి. ఐపీఎల్లో పాల్గొన్న ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటించారు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాలు ఆర్థిక సాయంతో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్లను డొనేట్ చేశాయి. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళాన్ని ప్రకటించింది.
కొవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్తో ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకునేందుకు సన్టీవీ(సన్రైజర్స్ హైదరాబాద్) రూ.30కోట్లు విరాళంగా ఇస్తోందని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన అధికారిక ట్విటర్లో పేర్కొంది. వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు కేంద్ర, రాష్ఱ ప్రభుత్వాలు చేపడుతున్న కొవిడ్-19 సహాయక చర్యలకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపింది.
Sun TV (SunRisers Hyderabad) is donating Rs.30 crores to provide relief to those affected by the second wave of the Covid-19 pandemic. pic.twitter.com/P6Fez9DuLo
— SunRisers Hyderabad (@SunRisers) May 10, 2021