ఎపి కి చేరిన మరో 2 లక్షల కోవాగ్జిన్ డోసులు
విజయవాడ: ఎపి కి మరో 2 లక్షల కోవాగ్జిన్ డోసులు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి టీకా డోసులు వచ్చాయి. అక్కడి నుండి రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాల అనంతరం ఈ వ్యాక్సిన్లను ఆయా జిల్లాలకు తరలించనున్నారు.