ఎంపీ డీఎస్‌తో ఈటల భేటీ

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బుధవారం రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. డీఎస్‌ నివాసానికి వెళ్లిన ఆయన దాదాపు గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. భవిష్యత్తు రాజకీయాలపై డీఎస్‌తో చర్చించినట్లు తెలిసింది. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నట్లు సమాచారం. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నట్లు ఈటల రాజేందర్‌ వివరించినట్లు సమాచారం. అదే సమయంలో డీఎస్‌ నివాసానికి వచ్చిన ఆయన తనయుడు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌తో కూడా ఈటల కొద్దిసేపు మాట్లాడారు. అలాగే, వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి, భాజపా నాయకుడు డా.చంద్రశేఖర్‌ను ఈటల రాజేందర్‌ కలిశారు. భవిష్యత్తు కార్యాచరణపై ఆయనతో చర్చించారు.