కోవిడ్పై పోరుకు సూర్య కుటుంబం రూ. కోటి విరాళం
తమిళనాడులో ఆపద అంటే సాయం అందించేందుకు ముందుకు వచ్చే నటుల్లో సూర్య కుటుంబం కూడా ఒకటి. ఇప్పటికే అగరం అనే సంస్థను స్థాపించి..పేద విద్యార్థులకు ఉచితంగా చదువును చెప్పిస్తున్నారు. తాజాగా కోవిడ్పై పోరులో భాగంగా మరో వితరణ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు ప్రముఖ నటులు శివకుమార్, ఆయన కుమారులు సూర్య, కార్తీలు రూ. కోటి రూపాయలు అందించారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు సిఎం సహాయ నిధికి సాధ్యమైనంత వరకు సహకరించాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పిలుపు మేరకు వీరు స్పందించి విరాళం అందించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆ మొత్తాన్ని స్టాలిన్కు చెక్కు రూపంలో అందజేశారు. అనంతరం శివ కుమార్ మాట్లాడుతూ..తాము తమ చేతనైన సాయం చేశామని, ప్రతి ఒక్కరూ కోవిడ్ పోరులో తమ వంతు సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.