రాష్ట్ర ప్రభుత్వానికి నాట్కో ఫార్మా విరాళం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాట్కో ఫార్మా భారీ విరాళం ఇచ్చింది. కరోనా నియంత్రణకు ఉపయోగించే బారిసిటినిబ్ మాత్రలను విరాళంగా ఇచ్చింది. ఒక లక్ష మంది కరోనా రోగులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ మాత్రలను అందివ్వనున్నారు. ఈ మాత్రల విలువ రూ. 4.2 కోట్లు. ఈ మేరకు సంబంధిత పత్రాన్ని నాట్కో సీఈవో రాజీవ్ నన్నపనేని మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నాట్కో సంస్థకు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.