కరోనాతో మృతి చెందిన తన కారవాన్ డ్రైవర్ కుటుంబానికి చిరంజీవి ఆర్థికసాయం

మెగాస్టార్ చిరంజీవి కారవాన్ డ్రైవర్ కిలారి జయరామ్ గత నెలలో కరోనాతో మృతి చెందాడు. చాలాకాలంగా తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్ మరణించడంతో చిరంజీవి తీవ్ర విచారానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో, తన కారవాన్ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. తాజాగా కిలారి జయరామ్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు చెక్కును ఆలిండియా చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబసభ్యులకు అందించారు.