నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఆదివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరగనుంది. లాక్డౌన్ పొడిగింపుపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్డౌన్తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే రాష్ట్రంలో కఠినంగా లాక్డౌన్ అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. రోజులో 20 గంటలు లాక్డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే. జూన్ నెలలో కూడా లాక్డౌన్ అమలు చేస్తారా అన్న ప్రశ్న తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠగా మారింది. లేక ఇదే పరిస్థితి ఉంటే మరిన్ని సడలింపులు ఇస్తారా అనే అంశంపై కేబినెట్ సమావేశం అనంతరం సమాచారం రానుంది. లాక్డౌన్పై స్పష్టత రావాలంటే మరో కొన్ని గంటలు వేచివుండాలి.