ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పగటి కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈ నెల 20 వరకు పొడిగించారు. కాగా.. సడలింపు సమయాన్ని పెంచారు. ఇప్పటి వరకు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉన్న సడలింపు సమయం.. ఈ నెల 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సీఎం అధ్యక్షతన నిర్వహించిన సమీక్షలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.