తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 42కి పెంపు

తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు సీజేఐ ఆమోదం తెలిపారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని హైకోర్టు రెండు సంవత్సరాలుగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి మేరకు సీజేఐ కీలక నిర్ణయం తీసుకున్నారు. జడ్జిల సంఖ్యను పెంచటం పట్ల తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.