ఇండియ‌న్ క్రికెట్‌కు ధోని చేసిన సేవ‌ల‌ను గుర్తుకు తెచ్చుకుంటూ ట్విట్ చేసిన మహేష్

టీమ్ ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని త‌న రిటైర్‌మెంట్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ క్రికెట్‌కు ధోని చేసిన సేవ‌ల‌ను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయ‌న భ‌విష్య‌త్ బావుండాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. ‘‘2011లో ఇండియాను క్రికెట్‌ విశ్వ‌విజేత‌గా నిలిపిన ఆ ఐకానిక్ సిక్స‌ర్‌ను నేను ఎలా మ‌ర‌చిపోగ‌ల‌ను! నేను ఆ స‌మ‌యంలో వాంఖేడియం స్టేడియంలోనే నిలుచున్నాను. గ‌ర్వంగా ఉంది. క‌న్నీళ్లు వ‌స్తున్నాయి. క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. టేక్ ఎ బౌ ఎం.ఎస్‌.ధోని’’ అని తెలిపారు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్.