‘మాస్ట్రో’ చివరి షెడ్యూలు మొదలెట్టిన నితిన్!

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ సినిమా రూపొందుతోంది. చాలావరకూ షూటింగును ఇప్పటికే కానిచ్చేశారు. చివరి షెడ్యూల్ చేయాలని అనుకుంటూ ఉండగా కరోనా ప్రభావం పెరిగిపోయింది. దాంతో మిగతా ప్రాజెక్టుల మాదిరిగానే ఈ సినిమా షూటింగు ఆగిపోయింది.

ఇక ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండటంతో, ఈ సినిమా టీమ్ చకచకా రెడీ అయింది. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ రోజున ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. తరుణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

హిందీలో హిట్ కొట్టిన ‘అంధాదూన్’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో నభా నటేశ్ కథానాయికగా నటిస్తుండగా, తమన్నా ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇక బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల నితిన్ చేసిన ‘చెక్’ .. ‘రంగ్ దే’ సినిమాలు నిరాశపరిచాయి. అందువలన ఈ సినిమాతో తప్పకుండ హిట్ కొట్టాలనే పట్టుదలతో నితిన్ ఉన్నాడు.