అలీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రభాస్

హాస్యనటుడిగా అలీ సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. అలాంటి అలీ నిర్మాతగా సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని ఒక సినిమాను నిర్మించాడు.. ఆ సినిమా పేరే ‘అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి’. శ్రీపురం కిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అలీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మౌర్యాని .. మంజుభార్గవి .. పవిత్ర లోకేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడారు.

“అలీ గారి ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తోంది .. ఇందులో మంచి మెసేజ్ ఉంది. ఏఆర్ రెహ్మాన్ దగ్గర పనిచేసిన రాకేశ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆల్రెడీ మలయాళంలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా, తెలుగులో కూడా కచ్చితంగా బాగుంటుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ .. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ‘అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి .. మనందరం థియేటర్లలో ఉండాలి” అన్నారు. కాగా, సోషల్ మీడియాలో ఆకతాయిల వలన అమాయకులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేదే ఈ సినిమా కథ.