“నారప్ప” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2” ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. అయితే వెంకీ అభిమానులకు షాకిస్తూ ఆయన నటించిన చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట మేకర్స్. తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్”కు రీమేక్ గా “నారప్ప” తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని ఓటిటిలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారట సురేష్ ప్రొడక్షన్స్ వారు. అయితే తాజా సమాచారం మేరకు “నారప్ప”ను ఓటిటిలో విడుదల చేయడానికి పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ తో భారీ డీల్ కుదుర్చుకున్నారట. ఈ చిత్రం జూలై 24 నుండి ప్రసారం అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే సినిమా విడుదల విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ చిత్రం మాత్రమే కాకుండా వెంకీ హీరోగా నటించిన మరో థ్రిల్లర్ మూవీ “దృశ్యం-2”, రానా దగ్గుబాటి “విరాటపర్వం” చిత్రాలను కూడా ఓటిటిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. కొన్ని రోజుల్లోనే ఈ సినిమాల రిలీజ్ విషయమై అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు. అయితే వెంకీ అభిమానులకు నిరాశ కలిగించే విషయమని చెప్పాలి. ఎప్పటి నుంచో ఈ రెండు సినిమాలు ఓటిటి బి బాట పడతాయనే వార్తలు విన్పిస్తున్నాయి. అయితే తాజాగా వస్తున్న వార్తలు ఈ సీనియర్ హీరో అభిమానులను అసంతృప్తికి గురి చేసే అవకాశము ఉంది. “నారప్ప, దృశ్యం-2” చిత్రాలను వెండితెరపై చూడాలని ఎదురు చూస్తున్నారు వెంకీ ఫ్యాన్స్. మరి ఈ ఓటిటి విడుదలైతే ఈ చిత్రాలకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.