Tokyo Olympics: ఆర్చరీ మెన్స్ విభాగంలో క్వార్టర్స్ చేరిన భారత్
టోక్యో: ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరింది. ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణ్దీప్ రాయ్తో కూడిన ఇండియన్ ఆర్చరీ టీం ఎలిమినేషన్లో కజకిస్థాన్పై విజయం సాధించింది. భారత ఆర్చరీ త్రయానికి కజక్ జట్టు ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆ జట్టుపై 6-2తో జయకేతనం ఎగురవేసిన భారత్.. క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. అంతకుముందు ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఫెన్సర్ భవానీ దేవి ఘన విజయం సాధించింది. టునీషియాకు చెందిన నాజియా బెన్ అజిజ్పై 15-3 పాయింట్ల తేడాతో విన్ అయ్యింది. మ్యాచ్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే భవానీ దేవి గెలుపును సొంతం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్ నాలుగో రోజు భారత్ శుభారంభం పలికినట్లయింది.