రాజ్ కుంద్రాలో మరో యాంగిల్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ..

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పేరు ప్రస్తుతం బాగా హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల కిందట రాజ్ కుంద్రా నీలి చిత్రీకరణ చేస్తున్నట్లు పైగా వాటిని ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తున్నట్లు తెలిసింది. తనతో పాటు తన ఫ్రెండ్ కూడా చేతులు కలుపుకొని ఈ వ్యవహారాన్ని చేస్తున్నట్లు బయటపడింది. ఇక చాలామందిని వెబ్ సిరీస్ లో అవకాశాలు ఇస్తున్నామని చెప్పి అటువంటి వ్యవహారల్లోకి లాగినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే మరో నటి అతడి గురించి ఓ నిజాన్ని బయట పెట్టింది.

ఇక వీటికోసం రాజ్ కుంద్రా ఏర్పాటు చేసిన యాప్ లను కూడా తొలగించగా.. మరో ఐబీ అధికారిని కూడా తనకు తెలియకుండానే ఇందులోకి లాగారు. అంతేకాకుండా ఈ విషయంలో మరో బోల్డ్ నటి షెర్లిన్ చోప్రా ను కూడా విచారణ చేయగా రాజ్ కుంద్రా గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది. ఈమెను అధికారులు జులై 27న విచారణ చేయగా అందులో ఆమె రాజ్ కుంద్రా తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని తెలిపింది.

రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత.. షెర్లిన్ చోప్రా పేరు బయటపడటంతో వెంటనే క్రైమ్ బ్రాంచ్ అధికారుల అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం బాంబే హైకోర్టులో ముందస్తు బెయిల్ ను కోరుకుంది. దీంతో హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేయగా.. క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆమెను విచారణ చేయడానికి నిర్ణయించుకున్నారు. అలా ఆమె కొన్ని విషయాలు పంచుకుంది.

తనను 2021లో పోర్న్ రాకెట్ కేసులో మొదటిసారిగా విచారణ చేశారని తెలిపిందని.. సైబర్ సెల్ లోని అధికారులకు ప్రతి ఒక్క విషయాన్ని తెలిపానని.. ఇక చెప్పాల్సినవి ఏమీ లేవని చెప్పినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. రాజ్ కుంద్రాకు, శిల్పా శెట్టి కి మధ్య సంబంధాలు సరిగా లేవని ఇక దాంతో రాజ్ కుంద్రా వైవాహిక, వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నట్లు తెలిపిందట షెర్లిన్. అలా అతడు తీవ్రమైన ఒత్తిడిలో ఉండేవాడని, తనతో పిచ్చిగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడని తేలింది.

ఇక అతని ప్రవర్తన చూసి తను భయపడేదట. అలా ఒక సారి గదిలో కూడా బంధించేందుకు ప్రయత్నించి తనను ముద్దు పెట్టుకోవడానికి బలవంతం చేశాడని వెల్లడయింది. అలా అతడి నుంచి తప్పించుకొని వాష్ రూమ్ లో దాక్కొందట షెర్లిన్. పైగా రాజ్ కుంద్రాకు తెలిసిన బిజినెస్ మేనేజర్ తో మీటింగ్ జరిగిన సమయంలో తన పేరు మీద కూడా యాప్ రిలీజ్ చేయాలని అనుకున్నారట. దాంతో తనకు రెవెన్యూ వస్తుందని చెప్పడంతో ఆ సమయంలో తను ఒప్పుకోకపోవడంతో వాదనలు జరిగాయని తెలిపినట్లు వెల్లడించారు అధికారులు.