బోనమెత్తిన వైఎస్ షర్మిల..

హైదరాబాద్‌లో ఆదివారం బోనాల పండుగ వైభవంగా జరిగింది. ప్రకృతి దేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు భారీగా తరలివచ్చారు. అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆషాడ మాస బోనాల సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రతి ఏటా నిర్వహించే ఆనవాయితీ ప్రకారం మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితురాలు రజిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్నారు.