శాసనసభలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసన సభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని 135 కోట్ల మంది జరుపుకునే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం మని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి స్పీకర్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్య్ర దినోత్సవమని చెప్పారు. అదేవిధంగా శాసన మండలి ఆవరణలో చైర్మన్‌ భూపాల్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అసెంబ్లీలోని జాతిపిత మహాత్మాగాంధీకి మండలి చైర్మన్‌, శాసనసభ స్పీకర్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, శాసనసభ అధికారులు పాల్గొన్నారు.