Paralympics: చరిత్ర సృష్టించిన అవని.. భారత్ కు పతకాల పంట

భారత మహిళా షూటర్‌ అవని లెఖారా మరోసారి చరిత్ర సృష్టించింది. 50మీ. రైఫిల్​ 3పీ విభాగంలో.. అవని లేఖరా కాంస్యం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. దీంతో పారాలింపిక్స్​లో రెండు పతకాలు సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారణిగా రికార్డుకెక్కింది.

కాగా.. టోక్యో పారాలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య 12కు చేరింది.