‘ఆచార్య’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్సయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
సామాజిక ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ఆచార్య చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ కథానాయిక. రామ్ చరణ్ ఇందులో ఓ ముఖ్యభూమిక పోషించాడు. రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే కనిపించనుంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ వేసవిలో తీసుకురావాలని ప్రయత్నించినా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండడంతో విడుదల వాయిదాపడింది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ నిర్మించాయి.
#Acharya Arrives on 4th Feb22@KonidelaPro @MatineeEnt @KChiruTweets #SivaKoratala pic.twitter.com/VeE9p7PLrg
— Ram Charan (@AlwaysRamCharan) October 9, 2021