పవన్ కళ్యాణ్కు ‘అలయ్ బలయ్’ ఆహ్వానం అందించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరగనుంది. నెక్లస్ రోడ్డులోని జలవిహార్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆమె పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.