నేటి నుంచే Metro సువర్ణ ఆఫర్‌

మెట్రో సువర్ణ ఆఫర్‌ – 2021 సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు ట్రిప్‌పాస్‌ను మెట్రోస్టేషన్లలో పొందొచ్చు. నిత్యం ప్రయాణించే మార్గానికి 20 ట్రిప్పుల ధరను ముందస్తుగానే చెల్లిస్తే.. మరో పది ట్రిప్పులను ఉచితంగా పొందొచ్చు. గ్రీన్‌ లైన్‌ (ఎంజీబీఎస్‌ – జేబీఎస్‌ – పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌ల మధ్య) ప్రయాణానికి కేవలం రూ.15 టికెట్‌ ధర కూడా నేటి నుంచే అందుబాటులోకి రానుంది. ఈ సువర్ణ ఆఫర్‌-2021 వచ్చే ఏడాది జనవరి 15 వరకు మాత్రమే ఉంటుంది.