జనసేన బలోపేతం కోసం క్రియాశీలక సమావేశం

తూర్పుగోదావరి జిల్లా, పి.గన్నవరంనియోజవర్గంలోని పార్టీ బలోపేతంపై జనసేన కసరత్తు మొదలుపెట్టింది. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి క్రియాశీల పాత్ర పోషించేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.క్రియాశీలక సభ్యుల నియామకం మరియు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ జనసేన ఆశయాలు ప్రతి ఇంటికీ చేరేలా చూడాలన్నారు. అన్ని కులాలను కలుపుకుంటూ అందరూ ఐక్యంగా పార్టీ భవిష్యత్తుకి ప్రతి జన సైనికుడు తన వంతు కృషి చేయాలని నాయకులు కోరారు. త్వరలో జనసేన చేయబోయే కార్యక్రమాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తామని జనసేన నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి పార్లమెంట్ ఇన్చార్జి డి ఎం ఆర్ శేఖర్, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ, కొత్తపేట నియోజక వర్గ ఇన్చార్జి బండారు బండారు శ్రీను , తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ , లూటుకుర్రు జనసేన పార్టీ సర్పంచ్ అడబాల తాతకాపు మరియు జనసైనికులు పాల్గొన్నారు.