సీఎం కేసీఆర్ యాదాద్రి టూర్, పున:ప్రారంభ తేదీ ప్రకటన?

ముఖ్యమంత్రి ఈరోజు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయ పున:నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌కి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సీఎం కేసీఆర్‌కి తీర్ధ ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయ పున:ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఆలయ పున:ప్రారంభానికి చినజీయర్ స్వామి ముహూర్తం ఖరారు చేశారు. యాదాద్రిలో సీఎం ప్రకటన చేస్తారని సమాచారం.

టెంపుల్ టూరిజం కింద యాదాద్రీశుడి గుట్టపై వెయ్యి ఎకరాల్లో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. యాదాద్రికి వచ్చే భక్తుల కోసం కాటేజీలు, ఉద్యానవనాలు నిర్మిస్తున్నారు. దాతల విరాళాలతో భారీ ఎత్తున వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీల విడిది కోసం విల్లాలు, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణంలో ఉంది. తొలిదశ 250 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలన పునర్మిర్మాణ పనులను పరిశీలించారు.