దుష్ప్రచారం చేస్తున్నాయంటూ.. యూట్యూబ్ ఛానళ్లపై కోర్టుకెక్కిన సమంత!

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకుల అంశంపై చాలా రకాల పుకార్లు, ఊహాగానాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పలు యూబ్యూట్ ఛానళ్లతోపాటు సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు రావడంతో సమంత కూకట్‌పల్లి కోర్టు ను ఆశ్రయించింది. తన పరువుకు నష్టం కలిగించిన సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, మరో ఛానల్‌తోపాటు సీఎల్ వెంకట్రావ్ అనే న్యాయవాదిపై సమంత పరువు నష్టం దావా వేసింది.

తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశించాలని కోర్టును విజ్ఞప్తి చేసింది సమంత. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్లీ తన సినీ కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయింది సమంత. మరోవైపు నాగచైతన్య కూడా తన సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.