Vemagiri: అక్రమ తవ్వకాలను పరిశీలించిన జనసేన నాయకులు

ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా వైసీపీ కార్యకర్తలు అక్రమంగా మట్టి కోసం కొండను తవ్వడం జరుగుతుంది.. భూమి సారవంతం పట్టించుకోకుండా ఇలా అక్రమ తవ్వకాలు ద్వారా భూసారం నాశనం జరుగుతుంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో ఇళ్ల స్థలాల చదును పేరుతో అక్రమ మట్టి తవ్వకంతో కొండను తవ్వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన జనసేన నాయకులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి, మల్కిపురం జనసేన ఎంపిపి మేడిచర్ల సత్యవాణి, అమీనా, మల్లు బాబీ, హుస్సేన్, రాము, మొండేటి ప్రసాద్, బాబులు, నాగరాజు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.