‘తెలంగాణా లో అసలైన రాజకీయ మార్పు జనసేనతోనే!’

డబ్బుతో పనిలేని అసలైన రాజకీయ మార్పును జనసేన ద్వారా చూడబోతున్నారని జనసేన తెలంగాణ ఇన్‌చార్జి నేమురి శంకర్‌గౌడ్‌ అన్నారు. విద్యార్థులే రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ సాధించే నాయకులుగా మారాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కోరుకున్నారని ఆయన తెలిపారు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి విభాగం కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బాగంగా శతఘ్ని న్యూస్ పేపర్ ని సంపత్ నాయక్ ఆద్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. శతఘ్ని న్యూస్ ని నాయకులందరూ కొనియడటం. జనసేన పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని శంకర్ గౌడ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో జనసైనికులు చేస్తున్న కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావటానికి మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం అని జనసేన పార్టీ ఖమ్మం జిల్లా ఇన్చార్జి రామ్ తాళ్లూరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం ఇన్‌చార్జ్‌ శ్రీరాం తాళ్లూరి, వరంగల్‌ ఇన్‌చార్జ్‌ ఆకుల సుమన్‌, రాష్ట్ర విద్యార్ధి విభాగం అధ్యక్షులు సంపత్‌, రాష్ట్ర విద్యార్ధి విభాగం సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.