Araku: ‘మార్పు’ వైసిపి మరియు టిడిపి నుండి భారీగా జనసేన లో చేరిన యువత
విశాఖ ఏజెన్సీ అరకు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్షేత్ర స్థాయి పర్యటనల్లో భాగంగా సుంకరమెట్ట గ్రామ పంచాయితీకి చెందిన వైసీపీ, టీడీపీల కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వీరంతా పిరిబంధ గ్రామానికి చెందిన వారు. ఆదివారం ఉదయం పార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీ సాయిబాబ, శ్రీ రామకృష్ణల ఆధ్వర్యంలో పిరబంధలో క్షేత్ర స్థాయి సమస్యలపై అధ్యయనం సాగింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను గిరిపుత్రులకు వివరించిన వారు.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదుకుతున్న జనసేన పార్టీ ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం గ్రామం నుంచి పలువురు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో శ్రీ జానీ, శ్రీ బాబురావు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-24-at-5.26.40-PM.jpeg)