Badvel: ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా జనసేన ప్రచారం

బద్వేల్ ఉప ఎన్నికల బరిలో ఉన్న భాగస్వామ్య పక్షం బీజేపీ అభ్యర్ధి విజయం కోసం జనసేన పార్టీ రంగంలోకి దిగింది. స్థానిక పార్టీ శ్రేణులను కలుపుకుంటూ ప్రచారం ముమ్మరం చేసింది. పార్టీ అధ్యక్షులు ఈ ఎన్నికల నిమిత్తం వేసిన త్రిసభ్య కమిటీలోని నాయకులు శ్రీ సుంకర శ్రీనివాస్, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ ముఖరం చాంద్ లు శనివారం శ్రీ అవదూత కాశీనాయన మండలంలో ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ బలపర్చిన బీజేపీ అభ్యర్ధికి ఓటు వేసి మార్పుకు నాంది పలకాలని సూచించారు. ప్రభుత్వ విధానాల పట్ల అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని ఈ సందర్భంగా శ్రీ సుంకర శ్రీనివాస్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఆ అసంతృప్తి కనబడబోతోందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో నియోజక వర్గ నాయకులు శ్రీ తుడిమెళ్ల మురళి, శ్రీ బసివి రమేష్, శ్రీ ఈశ్వర్ రెడ్డి, మండల నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ మస్తాన్, శ్రీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.