Amalapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి దళిత నాయకుల ఆధ్వర్యంలో శెట్టిబత్తుల రాజబాబు పాలాభిషేకం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ దళిత నాయకులు దామోదరం సంజీవయ్య గారి ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దడానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించడమే గాక కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలోని దళితులంతా ఋణపడి ఉంటారని దళితుల ఆత్మగౌరవం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి యావత్ దళిత జాతి ఋణపడి ఉంటుందని అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గం దళితులు ఈ రోజు పెద్ద సంఖ్యలో అమలాపురం పట్టణంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.