Vizag: తమ సమస్యలను జనసేన పార్టీ మత్యకార వికాస విభాగం దృష్టికి తెచ్చిన మత్స్యకారులు

ఈ నెల 25,26,27 తేదీల్లో జనసేన పార్టీ మత్యకార వికాస విభాగం విశాఖపట్టణం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖ తీరప్రాంతంలో చిరు వ్యాపారులు, వైజాగ్ ఫిషింగ్ హార్బర్ బోట్ బోనర్న్స్ వారు, జీవనోపాధి లేని మత్యకారులు వారి సమస్యలను జనసేన పార్టీ మత్యకార వికాస విభాగం దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర బొలిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర మత్స్యకార కమిటీ చైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.