Nellore: వైసీపీ నుంచి కీలక నాయకులు జనసేన పార్టీలో చేరిక

వైసిపిపార్టీ యువజన విభాగం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గాదం సతీష్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నా రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీ గాదం సతీష్ పార్టీలోకి రావడం ఎంతో ఆనందదాయకం అనీ, వైసిపి సీనియర్ నాయకులు పార్టీ సిద్ధాంతాలు నచ్చి మా పార్టీలో చేరి, బలోపేతానికి కృషి చేస్తానని మాట ఇవ్వడం శుభ పరిణామమని, దీర్ఘకాలంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకులను మా జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బాద్యతాయుతమైన పదవులతో గౌరవించుకుంటామని తెలిపారు.
శ్రీ గాదం సతీష్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది అనీ, వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా రాజీనామా చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షులు సూచనలతో పని చేసుకుంటాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నెల్లూరు నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.