ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు ప్రిన్స్ మహేష్ బాబును రంగంలోకి తెచ్చిన సజ్జనార్
పోలీస్ శాఖ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సజ్జనార్..ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని తన దూకుడు కనపరుస్తూ.. ఆర్టీసీ ని లాభాల బాటలో తెచ్చేందుకు ట్రై చేస్తున్న సజ్జనార్ .. తాజాగా సరికొత్త ఐడియా తో ప్రయాణికులను ఆకట్టుకున్నారు. గత కొంత కాలంగా డీజిల్, పెట్రోలు ధరలు ఆకాశానికి తాకుతున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు పెరుగుతున్న ధరలు సామాన్యులతో పాటు ఆర్టీసీకి గుదిబండలా మారింది. ఈ తరుణంలో ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు ట్విట్టర్ వేదికగా ప్రత్యేక ప్రచారం మొదలుపెట్టారు.
సూపర్స్టార్ మహేష్ ను అందులో పరోక్ష భాగస్వామిగా మార్చారు. ఆర్టీసీ వైపు ప్రయాణికులను ఆకర్షించేలా మహేశ్ చిత్రాల్లోని ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్ జోడించి మీమ్ రూపొందించారు. మహేష్ ఫోటోలతో రూపొందిన మీమ్లో బైకులో లీటరు పెట్రోలు కొట్టిస్తే సిటీ మొత్తం తిరగలేకపోవచ్చు కానీ లీటరు పెట్రోలు కంటే తక్కువ ధరలో లభిస్తున్న టీ24 టిక్కెట్టుతో సిటీ మొత్తం ప్రయాణించవచ్చని చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.