Echerla: జనసేనలోకి తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి
జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా వివిధ సంఘాల నాయకులు ఆయన్ని కలిశారు. జనసేనపార్టీకి తమ మద్దతు ప్రకటించారు. కొంత మంది పార్టీ కండువా కూడా కప్పుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు, తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రణస్థలం ఆంధ్రాబ్యాంకు సహకార సంఘం అధ్యక్షులు శ్రీ కరిమజ్జి మల్లేశ్వరరావు మరో 50 మందితో కలసి జనసేనపార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ సమక్షం వీరంతా పార్టీలో చేరారు. శ్రీ మనోహర్ వీరికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ సూచించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-03-at-12.11.17-PM-1024x758.jpeg)