Amalapuram: జనసైనికుని కుమార్తె చదువుకు అండగా అమలాపురం రూరల్ మండల జనసేనపార్టీ అద్యక్షులు

అమలాపురం మండలం, సాకుర్రు గ్రామానికి చెందిన జనసైనికుడు శిరగం ప్రసాద్ ఇటీవల కోవిడ్ కారణంగా మరణించగా అతనికి ముగ్గురు కుమార్తెలలో పెద్ద కుమార్తె చదువు నిమిత్తం (ఒక సంవత్సరానికి) 16 వేల రూపాయలు అవుతుందని స్కూల్ యాజమాన్యం తెలుపగా దానిని రెండు దఫాలుగా చెల్లిస్తామని అమలాపురం రూరల్ మండల జనసేనపార్టీ అద్యక్షులు శ్రీ లింగోలు పండు తెలియజేయగా మొదటి దశలో భాగంగా 8 వేల రూపాయలు ప్రసాద్ తల్లి ద్వారా స్కూల్ యాజమాన్యానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ మండల జనసేనపార్టీ అద్యక్షులు లింగోలు పండు, శ్రీరామ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.