తెలంగాణ వ్యాప్తంగా రైతు ధర్నాలు

 రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా..టీఆర్‌ఎస్‌ నేతలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి.

యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల, నియోజకవర్గ, జిల్లాలో కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.