Tanuku: ఈడూరులో జోరుగా జనసేన ప్రచారం
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని, శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పార్టీ తణుకు నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు తీరాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలన్నారు. గురువారం అత్తిలి మండలం ఈడూరులో జనసేన ఎంపీటీసీ అభ్యర్ధికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండలాధ్యక్షులు శ్రీ దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-12-at-1.23.17-PM-1-1024x558.jpeg)