గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన తేజస్వీ మదివాడ

బిగ్ బాస్ షో ఫేమ్ తేజస్వీ మదివాడ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్పూర్తిగా తీసుకుని శనివారం జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, బాధ్యతగా వాటిని రక్షించాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని టిడిపి పార్టీ నాయకురాలు గ్రీష్మ కావళిని కోరారు తేజస్వీ.