న్యాయస్థానం నుండి దేవస్థానం… అమరావతి రైతుల పాదయాత్ర…

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో అమరావతి రైతుల పాదయాత్ర ముగించుకొని కందుకూరు నియోజకవర్గానికి చేరగా 15వ తేదీ సోమవారం కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ పులి మల్లికార్జున ఆదేశాల మేరకు అమరావతి JAC శ్రీనివాసుని మర్యాద పూర్వకంగా కలిసి విక్కిరాలపేట జనసేన నాయకులు మనోజ్ యం(MMK) మరియు జై భీమ్ యూత్ వారి అహ్వానం మేరకు గ్రామానికి ఘనస్వాగతం పలుకడం జరిగింది. విక్కిరాలపేట గ్రామం పాలేరు బ్రిడ్జి మీద పూలతో ఘనస్వాగతం పలుకుతూ గ్రామంలోకి ఆహ్వానించడం జరిగింది.