విద్యార్ధులకు అండగా నిలిచినందుకు జనసేన పార్టీకి ధన్యవాదములు
అనంతపురం జిల్లాలో SSBN ఎయిడెడ్ కాలేజీ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన నేపథ్యంలో పోలీసువారు మరియు యజమాన్యం కలిసి విద్యార్థులపై జరిపిన దాడి విషయం తెలిసిన తక్షణమే స్పందించి, SSBN కాలేజీ విద్యార్థులందరికీ అండగా నిలిచి రాజకీయాలకు అతీతంగా సమస్య పరిష్కారమే ధ్యేయంగా విద్యార్థుల ఉద్యమం పక్కదారి పట్టకుండా ప్రైవేటీకరణ నిలిపివేసి ఎయిడెడ్ కాలేజీని కొనసాగిస్తామని మేనేజ్మెంట్ తీర్మానం చేసేవరకూ తోడునీడగా ఉండి మా ఉద్యమాన్ని సరైన మార్గంలో నడిపించి మాకు మార్గ నిర్దేశం చూపిన జనసేన నాయకులు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు శ్రీ లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి, చరణ్, M.V శ్రీనివాస్, కె.విశ్వనాధ్, పవనిజం రాజు, సంపత్, అశోక్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసారు.
ఇదే విధంగా మును ముందు మా విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తోడుండాలని ఆకాంక్షిస్తూ అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డిని కలిసి ఘనంగా సత్కరించి, విద్యార్థులకు అండదండగా నిలిచినందుకు జనసేన పార్టీకి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-16-at-8.34.13-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-16-at-8.34.13-PM-1-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-16-at-8.34.13-PM-2-1024x462.jpeg)