Rayavaram: అసంపూర్తిగా ఉన్న స్కూల్ బిల్డింగును వెంటనే నిర్మించాలి

రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(హైస్కూల్) చెల్లూరు జనసేనపార్టీ నాయకులు పరిశీలించగా పాఠశాలలో ఉన్న సమస్యలను గుర్తించడం జరిగింది. పాఠశాల స్లాబు నుండి వర్షం నీరు రావడంతో విద్యార్థిని, విద్యార్ధులు అసంతృప్తి చెందుతున్నారు అని తెలిపారు. నీరు నిలిచిపోవడం వలన దోమలు, అనేకరకాల పురుగులు, చేరి విద్యార్థిని, విద్యార్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అసంపూర్తిగా ఉన్న స్కూల్ బిల్డింగును వెంటనే నిర్మించాలని విద్యాశాఖ అధికారులను కోరారు.